Wed Dec 10 2025 08:06:27 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh :ఏపీ, గ్రామ సచివాలయాలకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి ఒకటి నుంచి గ్రామ, వార్డ్ సచివాలయాల బాంక్ ఖాతాలో 1000 రూపాయలు జమ చేయాలని నిర్ణయించింది. జనవరి ఒకటవ తారీకు నుండి గ్రామ, వార్డు సచివాలయాల ఈ సర్వీస్ ఖాతాలో 1000 లు జమ చేయాలని నిశ్చయించింది. ఇందులో సచివాలయాల ఇంటర్నెట్ బిల్ కోసం 799 రూపాయలు వినియోగించుకోవాలని తెలిపింది.
ఇంటర్నెట్ కోసం...
మిగిలిన ఎమౌంట్ స్టేషనరీ, రిపేర్ వగైరా కోసం వినియోగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంటర్నెట్ బిల్, ఇతర బిల్స్ ను భద్రపరచుకుని మండల గ్రామ వార్డ్ ఆఫీసర్ కి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంజీవో/యూజీఓ అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే తదుపరి నెలలో వెయ్యి రూపాయలు సచివాలయ ఖాతాకు జమ అవుతుందని తెలిపింది.
Next Story

