Tue May 06 2025 18:52:08 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ప్రకాశం జిల్లాలో స్వల్ప భూ ప్రకపంపనలు
ఆంధ్రప్రదేశ్ లో భూకంపం సంభవించింది. స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి

ఆంధ్రప్రదేశ్ లో భూకంపం సంభవించింది. స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ప్రకాశం జిల్లాలోని పలుచోట్ల భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జిల్లాలోనిజిల్లాలోని పొదిలి, కురిచేడు, ముండ్లమూరు మండలాల్లో ఐదు సెకన్ల పాటు భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
భూమి కంపించిన సమయంలో...
భూమి కంపించిన సమయంలో పెద్దయెత్తున శబ్దాలు వచ్చాయని ప్రజలు తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూమి కంపించడం సర్వసాధారణమేనని దీనికి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. నిన్న తెలంగాణలోనూ భూమి స్వల్పంగా కంపించిన సగంతితెలిసిందే.
Next Story