Sat Mar 21 2026 16:14:14 GMT+0530 (India Standard Time)
Iran - Israel War : ఇరాన్ కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో వ్యాపారాలపై ప్రభావం
ఇరాన్లో యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది

ఇరాన్లో యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. అదే సమయంలో వారు నివసిస్తున్న దేశం కూడా ఈ యుద్ధంలో భాగమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఇరానీయన్ అమెరికన్లు ఆశలు, ఆందోళనలు మధ్య ఇరుక్కుపోయారు. ఇలాంటి సమయంలో ఈ వారం నౌరోజ్ (ఇరాన్ నూతన సంవత్సరం) ఎలా జరుపుకోవాలన్న దానిపై వారు అయోమయంలో పడుతున్నారు. ఫిలడెల్ఫియాలో నివసిస్తున్న కేవాన్ పౌర్మిర్జాయే, ఆయన భార్య బెహ్నాజ్ ఆల్మాజీ గత వారం మాన్హాటన్లో జరిగిన పర్షియన్ విందుకు వెళ్లి నౌరోజ్ జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. పౌర్మిర్జాయే జీవితాంతం అమెరికాలోనే ఉన్నారు. ఆయన తల్లిదండ్రులు 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందే అక్కడికి వెళ్లారు.
కొత్త ఏడాది జరుపుకోవాలని..
“ఈ ఏడాది నౌరోజ్ నాకు నా స్వదేశాన్ని మళ్లీ చూడాలనే ఆశను ఇస్తోంది. ప్రపంచం కూడా ఇరాన్ అందాలను చూడాలి. ఎవరికీ యుద్ధం ఇష్టం లేదు. కానీ నాకు ఇది బలమైన భావన” అని ఆయన చెప్పారు. ఇరానీయన్ అమెరికన్లకు ఈ యుద్ధం భావోద్వేగాల ఘర్షణగా మారింది. ఒకవైపు ప్రభుత్వం పడిపోవాలనే ఆశ. మరోవైపు అక్కడ ఉన్న కుటుంబ సభ్యులపై ఆందోళన. యుద్ధంపై అసంతృప్తి, తమ జీవితాలు ప్రశాంతంగా ఉండటంపై కొంత గిల్టీ భావన కూడా కనిపిస్తోంది.యుద్ధం మూడో వారానికి చేరిన వేళ నౌరోజ్ వేడుకలు ఈ పరిస్థితిని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. సాధారణంగా నౌరోజ్ రోజున నృత్యం, సంగీతం, విందులు జరుగుతాయి. ముఖ్యంగా ఆకుకూరలతో చేసే ‘కుకు సబ్జీ’ వంటి వంటకాలు ఆశ, కొత్త ప్రారంభాలకు సంకేతంగా ఉంటాయి. అయితే ఈసారి అమెరికా అంతటా అనేక నౌరోజ్ కార్యక్రమాలు రద్దయ్యాయి లేదా నిశ్శబ్దంగా నిర్వహించారు. బోస్టన్ ఇరానియన్ అసోసియేషన్ అధ్యక్షుడు సయీద్ షఫియాన్ రాద్ “మేము ప్రజల భావాలను గౌరవించాలి. అందుకే కార్యక్రమాలన్నీ రద్దు చేశాం. ఇరాన్ ప్రజలకు శాంతి, అభివృద్ధి కావాలి” అని తెలిపారు.
విదేశాల్లో భిన్న స్పందనలు
ఇరానీయన్ ప్రవాసుల్లో విభేదాలు కొత్తవి కావు. కానీ యుద్ధం ఈ భేదాలను మరింత పెంచింది. ముఖ్యంగా యువతలో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాము దూరం నుంచి ఇరానీయులమని చెప్పుకోవడం అంటే ఏమిటన్న దానిపై వారు ఆలోచిస్తున్నారు. న్యూయార్క్లో ‘నౌరోజ్ బజార్’ నిర్వహిస్తున్న హెడి యూసెఫీ మొదట ఈ వేడుకలు చేయాలా వద్దా అనుమానించారు. కొందరు వ్యతిరేకత వ్యక్తం చేసినా చివరకు జరపాలని నిర్ణయించారు.“ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిఘటనలా నేను చూస్తాను. నౌరోజ్ ఆగిపోవాలని వాళ్లు కోరుకుంటారు” అని ఆమె చెప్పారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒమిడ్ అఫ్షర్ నౌరోజ్ సందర్భంగా పర్షియన్ వంటలు చేయడం ప్రారంభించారు. “ఇది మన సంస్కృతితో మళ్లీ కలిసే మార్గం. చిన్నప్పుడే మనలో ఆ భాగాన్ని దాచుకున్నాం” అని చెప్పారు.
ఉత్సవాలపై అంతర్గత సంఘర్షణ
కొంతమందికి నౌరోజ్ ఆనందం ఇవ్వడం కష్టంగా మారింది. “నా కుటుంబం ఇరాన్లో ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తుంటే ఈ సంప్రదాయాన్ని జరుపుకోవడం కష్టంగా ఉంది” అని పరిశోధకురాలు పర్సిస్ కరీం అన్నారు. “మార్పు కావాలి. కానీ అది దేశం లోపల నుంచి రావాలి” అని చెప్పారు.అదే సమయంలో బ్రూక్లిన్లోని ‘సోఫ్రెహ్’ రెస్టారెంట్ యజమాని నాసిం అలిఖానీ మాత్రం వేడుకలు కొనసాగించాలని నిర్ణయించారు.“చరిత్రలో ఎన్నో దాడులు జరిగాయి. అయినా నౌరోజ్ కొనసాగింది. ఈ యుద్ధం దాన్ని ఆపదు. పాటలు, నృత్యం తగ్గవచ్చు. కానీ ఆహారం మాత్రం తప్పదు” అని అన్నారు.
పర్షియన్ వ్యాపారాలపై ప్రభావం
సాధారణంగా నౌరోజ్ కాలం పర్షియన్ రెస్టారెంట్లకు అత్యంత రద్దీగా ఉంటుంది. కానీ ఈసారి కొన్ని ప్రాంతాల్లో వ్యాపారం తగ్గింది.అయితే లాస్ ఏంజెల్స్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ ఇరానీయన్ సమాజం పెద్దది కావడంతో వార్తల ప్రభావం మేరకు వ్యాపారం మారుతోంది.టోరాంజ్ రెస్టారెంట్ సహ యజమాని ఫరీనాజ్ పీర్షిరాజీ మాట్లాడుతూ “యుద్ధం మొదలైనప్పుడు రద్దీ పెరిగింది. ఇరాన్ నాయకుడు చనిపోయాడనే వార్తలతో కూడా జనాలు వచ్చారు. వాళ్లు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు” అని చెప్పారు.ఈ ఉద్రిక్త పరిస్థితులు సంప్రదాయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. సాధారణంగా దుఃఖ సమయంలో చేసే ‘హల్వా’ను కొందరు ఈసారి వ్యంగ్యంగా ఆనందానికి సూచిగా తయారు చేశారు.న్యూయార్క్లో నిర్వహించిన విందు కార్యక్రమంలో భాగస్వామ్యురాలు అనాయిస్ డెర్సీ మాట్లాడుతూ “ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ భావాలను పంచుకునే అవకాశం కల్పించాలనుకున్నాం. ఆహారం మనందరినీ కలిపే శక్తి” అని చెప్పారు.
Next Story

