Fri Mar 20 2026 05:09:47 GMT+0530 (India Standard Time)
లోక్ సభ స్పీకర్ సంచలన నిర్ణయం
లోక్ సభ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

లోక్ సభ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిది మంది సభ్యులపై వేసిన సస్పెన్షన్ ను తొలగించారు. లోక్ సభలో ఒక సీపీఎం, ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు లోక్ సభనుంచి ఇటీవల సస్పెన్షన్ కు గురయిన సంగతి తెలిసిందే. దీంతో ఎనిమిది సభ్యుల పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో వారంతా సభకు నేడు హాజరయ్యారు.
సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత...
సస్పెన్షన్ ఎత్తివేయడంతో సభా కార్యక్రమాలకు ఎనిమిది మంది సభ్యులు హాజరయ్యారు. ఇటీవల సభలో కొంత ఆందోళనకు దిగడంతో ఎనిమిది మంది సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నేడు సస్పెన్షన్ ఎత్తివేయడంతో వారంతా హాజరయి సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Next Story

